www.google.com

యుగ విభజన విధానాలు

రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
  • కందుకూరి వీరేశలింగం - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
  • ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
  • ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము ఇలా..
  • దివాకర్ల వేంకటావధాని - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము
  • పింగళి లక్ష్మీకాంతం - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..
  • ఆయాకాలాలలో ప్రముఖ సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..

[మార్చు]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు